24, నవంబర్ 2015, మంగళవారం

"ఇది వితరణ కాదు నా విద్యుద్ధర్మం " అంటూ నాబడి నూతన ఒరవడికి బాసటగా నిలిచిన ఎన్నారై మిత్రుడు, సోదరుడు, మార్గదర్శి ( బ్లాగర్ )

గతంలో మా బడి పిల్లలకి రెమ్మలు రమ్మన్నాయి అనే భారతీయ విఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ జీవిత చరిత్ర పుస్తకాలను వితరణ గా ఇచ్చిన ఎన్నారై  బ్లాగర్ మిత్రుడు ఇప్పుడు నేను గతంలో పనిచేసిన రేగడి కొత్తూరు బడి పిల్లలకోసం విలువైన గ్రంథాలయ పుస్తకాలను వితరణగా ఇచ్చారు. సార్! మీ అమూల్యమైన సూచనలు, ప్రోస్తాహం, మార్గదర్శనం చాలు,  మీ డబ్బులతో పుస్తకాలు పంపకండి  మీ సూచనల ప్రకారం పిల్లలకి కావాల్సిన పుస్తకాలను నేనే స్వయంగా ఇవ్వడమో లేదా వారిచేతనే  కొనిపించ డమో చేస్తాను లేదా స్థానిక వనరుల ద్వారా ఏర్పాటు చేస్తాను అంటే ఆ  ఎన్నారై మిత్రుడు ఇలా అన్నారు సార్!... ఇది నేను చేసే వితరణ కాదు నా విద్యుద్ధర్మమ్ "ఇట్ ఈస్ నాట్ చారిటి, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటి", బాధ్యత  అన్నారు . పిల్లలు భవిష్యత్తులో గొప్పవారు కావాలంటే ఖచ్చితంగా పుస్తకాలను చదవలంటారు ఇతను. నేడు పిల్లలు తలవంచి పుస్తకాలు చదివితే రేపు తల ఎత్తుకోని తిరిగే భావి పౌరులౌతారని దేశం గర్వించే మరియు జాతిని నిర్మించే వారౌతారని చెబుతారు, నమ్ముతారు  ఇతను. ఏ పుస్తకం ఏ పిల్లవాన్ని మార్చుతుందో మనకేం తెలుసు, గొప్పవాల్లంతా పుస్తకాలు చదవడం వల్లనే అలా కాగలిగారని అందుకే పిల్లల్ని  మంచి కథల పుస్తకాలు, స్పూర్తిని నిచ్చే పుస్తకాలు చదివేటట్లు ప్రోస్తహించాలని చెబుతారు ఇతను. చెప్పడమే కాకుండా మా బడికి విలువైన గ్రంథాలయ పుస్తకాలను మంచి పుస్తకం ప్రచురుణ కర్తల ద్వారా వితరణ గా ఇచ్చి దాన్ని తన బాధ్యత గా భావిస్తూ  నా నూతన ఒరవడికి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా  ఎన్నారై మిత్రునికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ........ వారి కలలను(మా కలల్ని కూడా) ఆశయాన్ని(మా ఆశ యాలని) నిజం చేయడానికి కృషిచేస్తానని మాటిస్తూ ......
వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలు 
వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల పార్సిల్ 


వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల ఆవిష్కరణ సమావేశం 

 గ్రంథాలయ పుస్తకాల ఆవిష్కరణ సమావేసంలో మాట్లాడుతున్నా మండల విద్యా శాఖాధికారి శ్రీ గురుప్రసాద్ గారు 

వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలను బడి ప్రధానోపాధ్యాయులకు అందచేస్తున్న మండల విద్యా శాఖాధికారి గారు 


వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలన బడి ఉపాధ్యాయులు శ్రీ సర్దార్ వలి గారికి  అందచేస్తున్న గ్రామస్తులు  

వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలను బడి ఉపాధ్యాయుడైన హరిహర గారికి  అందచేస్తున్న బడి అభివృద్ధి కమిటి చైర్మన్మం రామకృష్ణారెడ్డి గారు 

వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాలను బడి కమిటి ఉపాధ్యాయులు శ్రీ చింతా లక్ష్మీనారాయణ గారికి  అందచేస్తున్న గ్రామ పెద్ద శ్రీ సీతారామిరెడ్డి గారు 

వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల గురించి వివరిస్తున్న మండల విద్యా శాఖాధికారి గారు 

వితరణ గా ఇచ్చిన గ్రంథాలయ పుస్తకాల గురించి వివరిస్తున్న మండల విద్యా శాఖాధికారి గారు

గ్రంథాలయ పుస్తకాల ప్రాముఖ్యతని  గురించి వివరిస్తున్న  ప్రధానోపాధ్యాయులు శ్రీ నరసింహులు  గారు

 గ్రంథాలయ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు మరియు పిల్లలు 



11, నవంబర్ 2015, బుధవారం

టాగింగ్, టాగింగ్.... ఏ న్యూ వే అఫ్ లెర్నింగ్ నేమ్స్ అఫ్ ల్యాబ్ ఆపరేటస్


సైన్స్ లో ప్రయోగాలు చేయాలంటే  విద్యార్థులు  ప్రయోగశాల పరికరాలు వాడాలి, వాడాలంటే వాటి పేర్లు తెలిసివుండాలి , మరి పిల్లలకి వాటి పేర్లు తెలియక పొతే వాటిని ఎలా వాడుతారు? ఈ సమస్యను అధిగమించాలంటే వారికి పరికరాల పేర్లను మరచిపోకుండా ఉండేటట్లు నేర్పాలి అందుకోసమే ఈ ప్రయత్నం... హుర్రే!!!  ఈ కృత్యం ద్వారా పిల్లలకి ప్రయోగశాల పరికరాల పేర్లు సుపరిచితమయ్యాయి 














2, నవంబర్ 2015, సోమవారం

స్టీల్ గ్లాసులే ముద్దు, పేపర్ గ్లాసులు హద్దు, ప్లాస్టిక్ గ్లాసులు వద్దే వద్దు... అంటూ స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ రాష్ట్రం, స్వచ్ఛ భారత్ కోసం నినదిస్తున్న మా బడి ఏ పీ జే అబ్దుల్ కలాం సైన్సు క్లబ్ వాలంటీర్లు...

అక్టోబర్ రెండున జరిగిన స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ రాష్ట్రం, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తూ  గ్రామంలోని హోటళ్ళలో ప్లాస్టిక్ గ్లాసులు వినియోగం హానికరమని తెలియచేసే గోడ పత్రికలును హోటళ్ళ వద్ద అతికిస్తున్న ఏ.పి.జే.అబ్దుల్ కలాం సైన్స్ క్లబ్ వాలంటీర్లు 













16, అక్టోబర్ 2015, శుక్రవారం

ఊహించని ఫలాలనిచ్చిన నాబడి నూతన ఒరవడి.

తన మిత్రుడి సూచనతో నా బ్లాగ్ "నాబడి నూతన ఒరవడి" ని చూసిన ఒక ఎన్నారై,  ప్రభుత్వ బడిలో నేను అవలంభిస్తున్న బోధనా పద్ధతులను, అమూర్తభావనల అభ్యసన కొరకు మూర్త భావనలతో పునాది అనే నా బోధనా సరళిని అభినందిస్తూ నాకు  ఫోన్ చేశారు. తన ఆలోచనలు నాతో పంచుకున్నారు. అతనితో మాట్లాడుతుంటే సాక్షాత్తు విజ్ఞాన గనితో మాట్లాడుతున్నట్టు అనిపించింది. పదోన్నతిమీద ఉన్నత పాఠశాలకు వెళ్ళిన నేను ప్రాథమిక పాఠశాలలో అవలంభించిన నూతన ఒరవడిని ఎలా కొనసాగించాలా అని ఆలోచిస్తున్న నాకు ఒక మార్గాన్ని దిశానిర్దేసం చేశారు తను. నా బడి నూతన ఒరవడికి పార్ట్ - 2 కి అన్నిరకాలుగా తనవంతు సహాయ సహకారాలని అందిస్తానాని తెలియచేసారు.  తను గతంలో లండన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో కొన్ని సంవత్సరాలు పని చేసిన అనుభవం కారణంగా తనకు విద్యా విధానం మీద, పలు బోధనా  పద్ధతుల మీద పూర్తి అవగాహన కలిగి వున్నారు. అంతేకాకుండా స్వతహాగా పుస్తకాలు బాగా చదివే అలవాటు వున్న కారణంగా చాల విషయాలమీద స్పష్టమైన అవగాహన కలిగి వున్నారు. తను  ప్రతి వారాంతాలలో నాకు ఫోన్ చేసేవారు.
ఫోన్ చేసిన ప్రతిసారి భోదనా పద్ధతుల మీద,  ప్రస్తుత విద్యా విధానం మీద చర్చించే వాళ్లము, ఆ చర్చల్లో భాగంగా మా బడిలో పిల్లలకు మన శాస్త్రవేత్తల గురించి పరిచయం చేయడంవల్ల వారిలో వున్నా అంతర్గత నైపుణ్యాలను శాస్త్రవేత్తలు కావాలనే కాంక్షను రగిలిన్చావచ్చని అనుకున్నాము. అనుకున్నదే తడవుగా తను మా బడి పిల్లలకోసం చెన్నై లోని ఐఐటి ప్రొఫెసర్ శ్రీ శ్రీనివాస చక్రవర్తి గారు వ్రాసిన  ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త శ్రీ జగదీశ్ చంద్ర బోస్ జీవిత చరిత్ర  "రెమ్మలు రమ్మన్నాయి" అనే పుస్తకాలను మరియు నాకు మరియు నా ఉపాధ్యాయ మిత్రులకు ఉపయోగపడే కొన్ని పుస్తకాలను కినిగే.కాం అనే ఆన్ లైన్ పుస్తకాల షాప్ ద్వారా నా అడ్రెస్సుకు  పంపించారు. దీనితో ఆపరేషన్ నో యువర్ ఏమినెంట్ సైంటిస్ట్స్ మొదలెట్టాను. ఆపరేషన్ నో యువర్ ఏమినెంట్ సైంటిస్ట్ లో భాగంగా 
ఆ రెమ్మలు రమ్మన్నాయి  పుస్తకాలను మా బడి లో కొందరి విద్యార్తులకు మా బడి ప్రధానోపాధ్యాయుల మరియు ఉపాధ్యాయుల  చేతులమీదుగాఎన్నారై గారి తరఫున అందచేసి, ఆ పుస్తకాన్ని చదివి వారి స్వంత మాటల్లో జగదీశ్  చంద్ర బోస్ గారి గురించి చెప్పాలని, వ్రాయాలని చెప్పడం జరిగింది. కొన్ని ప్రాథమిక ఇబ్బందులను అధిగమించి చివరకు పిల్లలు జగదీశ్ చంద్ర బోస్ గారి గురించి కొన్ని వాక్యాలు మాట్లాడ గలిగే స్తాయికి మరియు  వ్రాసే స్తాయికి వచ్చారు. మలి ప్రయత్నంలో సి.వి. రామన్ గారి పుస్తకాలను ఇంకా ఎక్కువమంది పిల్లలకు ఇచ్చి పిల్లలతో ఆపరేషన్ నో యువర్ ఏమినెంట్ సైంటిస్ట్స్ కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. ఇంతటి గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తున్న ఎన్నారై గారికి మా బడి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. పిల్లలకు సుభాశిస్సులు.